కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని 44 మంది ‘జిట్స్’ స్టూడెంట్స్కు ఉద్యోగాలు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని 44 మంది ‘జిట్స్’ స్టూడెంట్స్కు ఉద్యోగాలు

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని జ్యోతిష్మతి ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫైనలియర్ బీ ఫార్మసీ విభాగానికి చెందిన 44 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటారు. రూ.3లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారని కాలేజీ చైర్మన్​ జువ్వాడి సాగర్​ రావు తెలిపారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన 'మెడ్ ప్లస్' ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్ హెచ్ఆర్ ఆకుల రాజు ఆధ్వర్యంలో జరిగిన రిక్రూట్​మెంట్​లో ట్రైనీ ఫార్మసిస్ట్‌‌‌‌‌‌‌‌లుగా ఎంపికై, రూ.3లక్షల వార్షిక ప్యాకేజీని పొందారన్నారు. సంస్థ సెక్రటరీ అండ్​ కరస్పాండెంట్ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ వి.రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ విద్యార్థులను అభినందించారు.