పాల్వంచలో 4.5 కిలోల గంజాయి పట్టివేత

పాల్వంచలో 4.5 కిలోల గంజాయి పట్టివేత

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం వద్ద గురువారం 4.5 కిలోల గంజాయిని ఖమ్మం ఎన్‌‌‌‌ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్‌‌‌‌ఐ శ్రీహరి రావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయిని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.  

అరెస్ట్​ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని కర్నూలుకు చెందిన ఎస్‌‌‌‌కే మహమ్మద్ అవేజ్ భాష, పుష్పాల జగన్నాథ్‌‌‌‌తో పాటు ఒడిశాకు చెందిన ప్రసన్నజిత్ మండల్, ప్రీతం రాయ్ ఉన్నారు. వారి  నుంచి 4.5 కిలోల ఎండు గంజాయి, రెండు బైక్​లు  మూడు సెల్‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకన్నారు.