రాయ్ గఢ్ ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..

రాయ్ గఢ్ ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో నిన్న కుప్పకూలిన బిల్డింగ్  ఘటనపై ప్రధాని మోడీ  దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. ఘటనలో చిక్కుకున్న వారి ఫ్యామిలీలు ఎంతగా నష్టపోయాయో తనకు తెలుసన్నారు.  ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

మరో వైపు ఈ ఘటనలో  ఎన్డీఆర్ఎఫ్  రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.  ఇప్పటి వరకు  ఇద్దరి మృత దేహాలను బయటకు తీశారు.  ఇంకా 18 మంది చిక్కుకుని ఉంటారని వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయగడ జిల్లా కలెక్టర్ నిధి చౌదరి వెల్లడించారు.