ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు

ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు

భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. US రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో లేటెస్టుగా విడుదల చేసిన ఫోర్బ్స్ లిస్టులో ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ లిస్టులో.. అరిస్టా నెట్‌వర్క్ CEO జయశ్రీ ఉల్లాల్ 1.7బిలియన్ డాలర్ల ఆస్థులతో 16వ స్థానంలో నిలవగా.. సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి.. 1 బిలియన్ డాలర్ల విలువైన ఆస్థులతో  26వ స్థానంలో నిలిచారు. 
కాన్ఫ్లుయెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే 925 మిలియన్ డాలర్లు, జింగో బయోవర్క్స్ సహ ఫౌండర్ రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో వరుసగా 29, 39వ స్థానాల్లో నిలిచారు. పెప్సికో సంస్థ CEO గా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్ర నూయి.. 290 మిలియన్ డాలర్ల ఆస్థులతో ఫోర్బ్స్ జాబితాలో 91వ స్థానంలో నిలిచారు.