కరోనా విజృంభణను అరికట్టడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఫేజ్-3 కింద అదనంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆహారధాన్యాలను మే, జూన్ నెలల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. కేటాయింపుల దామాషా ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గోధుమలు, బియ్యం కేటాయింపు చేపట్టాలని కేబినెట్లో నిర్ణయించారు. రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ పరిస్థితులు, తుపానులు, భారీ వర్షాలు, ఆహార సరఫరాలు, కోవిడ్ సంబంధిత ఆంక్షలు వంటివాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత పంపిణీని చేయనున్నట్లు కేబినెట్ తెలిపింది. ఈ ఉచిత పంపిణీ వల్ల సుమారు 79.88 కోట్ల మందికి నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రెండు నెలలపాటు ఆహారధాన్యాల పంపిణీకి సుమారు రూ.25,332.92 కోట్లు అవుతుందని కేబినెట్ అంచనా వేసింది. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదల కష్టాలను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మోడీ తెలిపారు. అదేవిధంగా పీఎం-కేర్స్ నిధులతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రుల్లో రెండు హై ఫ్లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: పేదలకు మరోసారి కేంద్ర సాయం..
- దేశం
- May 6, 2021
లేటెస్ట్
- ఓటర్లను రెచ్చగొట్టొద్దు .. ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: వికాస్రాజ్
- తెలంగాణకు కేంద్రం ఇచ్చింది.. రూ.10లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
- నామినేషన్లు షురూ .. తొలి రోజు 42 మంది దాఖలు
- కాంగ్రెస్-సర్వే రిపోర్టులు | కేసీఆర్-20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీ -సింగరేణి కార్మికులు | V6 తీన్మార్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్