
వాషింగ్టన్: ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధాలను ఆపుతూ ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నోబెల్ బహుమతికి అర్హుడని ఆర్మేనియా ప్రధాని నికోల్ పషియాన్ చెప్పారు. ఆయనకు నోబెల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అజర్ బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హం అలియెవ్ కూడా ఇదే డిమాండ్ చేశారు. శనివారం వైట్ హౌస్లో ట్రంప్తో నికోల్, అలియెవ్ భేటీ సందర్భంగా ఈమేరకు ప్రతిపాదన చేశారు. దీంతో ట్రంప్కు నోబెల్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్న దేశాల సంఖ్య ఐదుకు చేరింది. పాకిస్తాన్, ఇజ్రాయెల్, కంబోడియా దేశాధినేతలు ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని ప్రతిపాదించారు.