మిక్సీలో బంగారం ఉంచి దుబాయ్ నుంచి ఇండియాకు స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిబ్బంది పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు దుబాయ్ లో నివసిస్తున్నాడు.
స్మగ్లింగ్ చేస్తూ దొరకకూడదని మిక్సీ మిషన్ లో 819గ్రాముల బంగారాన్ని దాచి ఉంచాడు. ఎయిర్ పోర్ట్ కి రాగానే సిబ్బంది అనుమానం వచ్చి మరింత తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది. దాని విలువ రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.