5లక్షల మంది వలసదారులు అమెరికా విడిచి వెళ్లాల్సిందే..అమెరికా సుప్రీంకోర్టు

5లక్షల మంది వలసదారులు అమెరికా విడిచి వెళ్లాల్సిందే..అమెరికా సుప్రీంకోర్టు

వలసదారుల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధించింది. అక్రమంగా నివాసముంటున్న వలసదారులను అమెరికానుంచి వెళ్లిపోవాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి  కోర్టు అనుమతించింది. సుప్రీంకోర్టు తర్వాత దాదాపు 50వేల మంది వలసదారులపై ప్రభావం పడనుంది. 

కోర్టు తీర్పుతో అమెరికాలో ఉన్న 5లక్షల 32వేల మంది వలసదారులు బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులానుంచి వలస వచ్చినవ వారిపై ఎక్కువ ప్రభావం ఉండనుంది. 

అంతకుముందు అమెరికాలో నివసిస్తున్న దాదాపు 3లక్షల 50వేల మంది వెనుజులా ప్రజలకు అప్పటి బైడెన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ పెరోల్ నుమంజూరు చేసింది. అయితే ఈ హోదాను ముగించేందుకు సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ కు అనుమతిచ్చింది. ఇమ్మిగ్రేషన్ పెరోల్ ముగించే ట్రంప్ చర్యను తాత్కాలికంగా నిలిపివేస్తూ యూఎస్ జిల్లా జడ్జి ఇందిరా తల్వానీ ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

ఇమ్మిగ్రేషన్ పెరోల్ అంటే..

యునైటెడ్ స్టేట్స్ చట్టాల ప్రకారం..ఇమ్మిగ్రేషన్ పెరోల్ అత్యవసర మానవతా కారణాలు లేదా ముఖ్యమైన ప్రజా ప్రయోజనం కోసం మంజూరు చేసిన తాత్కాలిక అనుమతి. ఈ పెరోల్ కింద  పైన తెలిపిన నాలుగు దేశాల నుంచి నెలకు 30వేల మంది వలసదారులకు రెండేళ్ల పాటు అమెరికాలోకి ఉండడానికి వీలు కల్పించింది.

ఇది వలసదారులు యునైటెడ్ స్టేట్స్‌లో నివసించడానికి ,పని చేయడానికి అనుమతిస్తుంది. అమెరికా, -మెక్సికన్ సరిహద్దులో అక్రమ వలసలను నిరోధించడానికి తన పరిపాలన విధానంలో భాగంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పెరోల్‌ను ఉపయోగించారు.

►ALSO READ | నేవీ రంగంలోకి దిగుంటే.. పాక్ ఈ సారి 4 ముక్కలయ్యేది: రాజ్ నాథ్ సింగ్ హాట్ కామెంట్స్