వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశ ఐక్యతకు పటేల్ ఇచ్చిన పిలుపును ప్రతిబింబిస్తూ రన్ ఫర్ యూనిటీ పేరుతో మారథాన్ పోటీలు జరిపారు. మెదక్ జిల్లాలో ఏఎస్పీ మహేందర్ జెండా ఊపి 2కె రన్ ప్రారంభించారు. బోధన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రన్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో సైతం యూనిటీ రన్ నిర్వహించారు. పాపన్నపేటలో ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, తూప్రాన్ లో సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో, శివ్వంపేటలో పోలీసుల ఆధ్వర్యంలో, నిజాంపేటలో ఎస్ఐ రాజేశ్ ఆధ్వర్యంలో, మనోహరాబాద్లో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో రన్నింగ్నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులను అందజేశారు.
సంగారెడ్డి పట్టణంలో ఎస్పీ పరితోశ్ పంకజ్, అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రన్ఫర్యూనిటీ నిర్వహించారు. కలెక్టర్ ఆఫీసు నుంచి ఐబీ ఆఫీస్వరకు ర్యాలీ కొనసాగించారు. సదాశివపేటలో సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో, అమీన్పూర్మున్సిపాలిటీపరిధిలోని సుల్తాన్పూర్లో డీఎస్పీ ప్రభాకర్ఆధ్వర్యంలో, సిద్దిపేట పట్టణంలో ఏసీపీ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో రన్నింగ్పోటీలను నిర్వహించారు. చేర్యాల పట్టణంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ బాయ్స్, గర్ల్స్, కేజీబీవీ గర్ల్స్ పాల్గొన్నారు.
