జూలై 1న నెక్లెస్​ రోడ్డులో 5కె రన్

జూలై 1న నెక్లెస్​ రోడ్డులో 5కె రన్

ఖైరతాబాద్, వెలుగు: డాక్టర్స్ డే సందర్భంగా జులై1న నెక్లెస్​రోడ్డులో 5కె రన్ నిర్వహిస్తున్నట్లు ‘అమ్మణి’ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మలుగు ఆమని తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రన్​పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 7 గంటలకు రన్​మొదలవుతుందని, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు.  

బాలికలు, మహిళల ఆరోగ్యం, పకృతి, జీవన శైలిపై అవగాహన కల్పిస్తూ ఈ రన్​నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసెంబీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొని రన్​ను ప్రారంభిస్తారని వెల్లడించారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షురాలు భారతి, న్యాయవాది ఎస్.జస్బీర్​సింగ్ తదితరులు పాల్గొన్నారు.