
సూర్యాపేట జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో పలు ఆయా గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. సోమవారం ఒకే ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వెంటనే వారిని సూర్యపేట ప్రభుత్వ హాస్పిటల్ లోని క్వారంటైన్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. మంగళవారం మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారని కాలనీల్లో సానిటేషన్ పనులను ముమ్మరం చేశారని తెలిపారు. పనులను పర్యవేక్షించిన జగదీశ్ రెడ్డి.. సామాజిక దూరం పాటించి వైరస్ నుంచి రక్షించుకోవాలని ప్రజలకు రిక్వెస్ట్ చేశారు. మొత్తం సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 8కి చేరాయి.
వివరాలు
సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమాను కోట గ్రామంలో ఒకే ఫ్యామిలీ లోని ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామస్తులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సూర్యాపేటలోని కుడకుడలోని తన అల్లుడితో కలిసి గత నెల మార్చిలో ఢిల్లీ మార్కర్ జాతరకు వెళ్లొచ్చాడు. ఈ క్రమంలో వర్దమానుకోటకు చెందిన వ్యక్తి కుమారులు సూర్యాపేటలో ఉన్న తన అల్లుడు కొడుకును తీసుకుని గ్రామానికి వచ్చారు. అల్లుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతని ఇంటికి వెళ్లి వచ్చిన వర్దమానుకోటకు చెందిన సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల అందరినీ సూర్యాపేట ఏరియా హాస్పిటల్లోని క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు.
కుటుంబ సభ్యుల్లో సోమవారం ఆరుగురికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురి రిజల్ట్స్ రావాలని ఆఫీసర్లు తెలిపారు. అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వర్దమానుకోట గ్రామానికి చెందిన వ్యక్తి కి మొదటగా కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం కరోన పాజిటివ్ వచ్చిన ఆరుగురిలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన (కుడకుడ గ్రామానికి చెందిన వ్యక్తి) భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లు, కూతురు ఉన్నట్లు సమాచారం. వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా సూర్యాపేట జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు ఎనిమిదికి చేరాయి.
ఇండ్లలోంచిఎవరూబయటకు రావొద్దు
కరోనా పాజిటివ్ వచ్చిన భగత్సింగ్ నగర్, వర్ధ మానుకోట ప్రాంత ప్రజలు ఒక్కరూ కూడా ఇండ్ల లోంచి బయటికి రావద్దని కలెక్టర్ లిపారు. భగత్సింగ్ నగర ప్రాంతాన్ని ఆయన పరిశీలించా రు. అనంతరం
ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు అందజేస్తామని చెప్పారు.
సూర్యాపేటలో రెడ్ జోన్ గా 15 వార్డులు
సూర్యాపేట పట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులను రెడ్ జోన్ గా ప్రకటించారు.