లక్నో : నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలపై బస్సు దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ముజఫర్నగర్-సహరాన్పూర్ రహదారిపై గలౌలి చెక్ పోస్టు వద్ద గడిచిన రాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నో రోజులుగా నడుస్తున్న వలస కూలీలు.. గమ్యం చేరకముందే ఇలా అర్ధాంతరంగా అసువులు బాశారు. ప్రమాదానికి అతి వేగమే కారణం అంటున్నారు పోలీసులు.