ఏఐ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు ఇమేజ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 నెలల ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌

ఏఐ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు ఇమేజ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 నెలల ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గేమింగ్‌‌‌‌‌‌‌‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ (ఏఐ), కంప్యూటర్ విజన్ వంటి వివిధ సెగ్మెంట్లలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌ల కోసం  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని  ఇమేజ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు నెలల యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు.  ఇండియా మొత్తం మీద 23 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్నాయి.  సొసైటీపైన ప్రభావం ఎంత ఉంటుంది, బిజినెస్ మోడల్‌‌‌‌‌‌‌‌ బట్టి  స్టార్టప్‌‌‌‌‌‌‌‌లను ఎంపిక చేశామని ఇమేజ్ సీఓఈ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్ (సీఓఈ) కోసం రూ.19.68 కోట్లను కేటాయించగా, ఇందులో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్​ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌టీపీఐ) రూ.9.8 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రూ. 3.5 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.4 కోట్లు, ఇండస్ట్రీ రూ.2.5 కోట్లు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇమేజ్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌నూ ఏర్పాటు చేసేందుకు రూ.4.4 కోట్లను కేటాయించారు. తాజాగా  23 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లను 3 వ బ్యాచ్ కింద తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఇమేజ్‌‌‌‌‌‌‌‌ సీఓఈ 10 స్టార్టప్‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు రూ.50 లక్షల చొప్పున సీడ్‌‌‌‌‌‌‌‌ ఫండింగ్ అందించింది.