రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. కరీంనగర్, రామగుండం సీపీలతో పాటు సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి ఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించినట్లు తెలుస్తోంది. బదిలీల్లో భాగంగా వెయిటింగ్ లో ఉన్న  ఐపీఎస్ లకు సైతం పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ట్రాన్స్ఫర్ అయిన వారిలో ఎస్పీ స్థాయి నుంచి ఐజీ స్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.