
హనుమకొండ, వెలుగు: మేడారం జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మేడారం ట్రాఫిక్ జోన్ ఇన్చార్జ్, వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఛత్తీస్ గఢ్ వైపు నుంచి వచ్చే వెహికిల్స్ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా యాక్షన్ తీసుకుంటున్నట్లు చెప్పారు. మేడారంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసులకు ఆల్ఫాబెటికల్నంబర్స్ కేటాయించినట్లు తెలిపారు. ఆర్టీసీ వెహికిల్స్ సమ్మక్క గద్దెకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుందని, పార్కింగ్ ప్లేస్ 'ఏ' నుంచి 'జీ' కూడా గద్దెలకు సమీపంలోనే ఉంటాయన్నారు. ఇప్పటికే ఇసుక లారీలు ఆపేశామని, వాటిని మంగపేట రూట్కు డైవర్ట్ చేశామన్నారు. 10వ తేదీ నుంచి జవహర్నగర్ టోల్ గేట్నుంచి ఎలాంటి టోల్ వసూళ్లు లేకుండా వెళ్లే ఏర్పాట్లు
చేశామన్నారు.
మూడు షిఫ్టుల్లో డ్యూటీ
మేడారం జాతరలో ట్రాఫిక్ జోన్ ను 20 సెక్టార్లుగా విభజించి, ముగ్గురు డీసీపీలను ఇన్చార్జీలుగా నియమించినట్లు సీపీ చెప్పారు. కమిషనరేట్ నుంచి 11 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని, ఇందులో 6 వేల మందిని కంప్లీట్గా ట్రాఫిక్ డ్యూటీకే కేటాయించినట్లు తెలిపారు. గట్టమ్మ టెంపుల్దగ్గర రద్దీ దృష్ట్యా ఎస్పీ స్థాయి ఆఫీసర్తో ట్రాఫిక్ను పర్యవేక్షిస్తామన్నారు. ప్రతి సెక్టార్ కు ఒక అడిషనల్ ఎస్పీ లేదా డీఎస్పీలు ఇన్చార్జీలుగా ఉంటారన్నారు. 30 బైక్ టీమ్స్ ఏర్పాటు చేశామని, ఈ టీమ్స్ మూడు షిఫ్టుల్లో డ్యూటీ చేస్తాయన్నారు.
డ్రోన్లు, టోయింగ్ వెహికిల్స్ ఏర్పాటు
ఎన్హెచ్-163 నేషనల్ హైవేపై ప్రతి 4 కిలోమీటర్లకు ఒక అవుట్ పోస్ట్ ఉంటుందని సీపీ చెప్పారు. మేడారం –-పస్రా రూట్పై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఈ దారిలో ప్రతి అర కిలోమీటర్ కు ఒక అవుట్ పోస్ట్ పెట్టామన్నారు. జాతరకు వెళ్లే రూట్ను డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తామన్నారు. దీని కి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఎక్స్పర్ట్స్ని నియమించామన్నారు. 380 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. మేడారం మార్గంలో టోయింగ్ వెహికిల్స్ ఏర్పాటు చేసి.. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూస్తామన్నారు.
రోడ్లపై పార్క్చేయొద్దు
రోడ్లపై వెహికిల్స్ పార్క్ చేయొద్దని సీపీ భక్తులకు సూచించారు. 21 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామని, ఎక్కడైనా రోడ్లపై గాని, పక్కన గాని పార్క్ చేసినట్టు కనిపిస్తే టోయింగ్ వెహికిల్స్ ద్వారా తొలగిస్తామన్నారు. సీపీ వెంట డీసీపీ వెంకటలక్ష్మి , వరంగల్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ పోతరాజు సాయి చైతన్య, సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు.