గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి

గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి

హర్యానాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గణనాథుడ్ని నిమజ్జనం చేస్తుండగా.. ఏడుగురు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. సోనిపట్ లో ముగ్గురు.. మహేంద్రగర్హ్ లో నలుగురు చనిపోయారు. సోనిపట్ లోని మిమార్ పూర్ దగ్గర గమేశ్ నిమజ్జనం చేసేందుకు ఓ వ్యక్తి, తన కుమారుడు, అల్లుడితో కలిసి వచ్చాడు. నిమజ్జనం టైంలో ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో పడి చనిపోయారు.

మహేంద్రగర్హ్ కు సమీపంలోని కెనాల్ లో గణనాథుడ్ని నిమజ్జనం చేసేందుకు వచ్చిన 9 మందిలో నలుగురు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. మిగిలిన వారిని స్థానికులు కాపాడారు. ఈ రెండు ఘటనలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్ని ఖట్టర్ స్పష్టం చేశారు .