రాష్ట్రానికి కొత్తగా 750 MBBS​ సీట్లు

రాష్ట్రానికి కొత్తగా 750 MBBS​ సీట్లు

హైదరాబాద్​, వెలుగు: నీట్​ రాసిన తెలంగాణ స్టూడెంట్లకు భారత వైద్య మండలి (ఎంసీఐ) మంచి వార్తను చెప్పింది. రాష్ట్రానికి కొత్తగా 750 ఎంబీబీఎస్​ సీట్లను ఇస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. రెండు ప్రభుత్వ కాలేజీలు, మూడు ప్రైవేట్​ మెడికల్​ కాలేజీలకు గుర్తింపునిచ్చింది. ఒక్కో కాలేజీకి 150 చొప్పున కొత్త సీట్లను కేటాయించింది. పోయినేడాది అనుమతి దక్కని నల్గొండ, సూర్యాపేట మెడికల్​ కాలేజీలకు ఎంసీఐ ఈసారి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 1250 సీట్లుండగా కొత్త వాటితో కలిపి 1550కి చేరింది. ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 2100 నుంచి 2550కి పెరిగాయి. మైనారిటీ కాలేజీల్లోని సీట్లతో కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఎంబీబీఎస్​ సీట్లు 4600 ఉన్నాయి. ఎంబీబీఎస్​ సీట్ల పెరుగుదలపై వారం క్రితమే ‘వెలుగు’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. 2 ప్రభుత్వ మెడికల్​ కాలేజీలకు అనుమతి రావడం పట్ల ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, వైద్య విద్య డైరెక్టర్​ డాక్టర్​ రమేశ్​ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కాలేజీలకు నిధులిచ్చిన సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

85 శాతం మనోళ్లకే

ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లలో 85 శాతం సీట్లు రాష్ట్ర స్టూడెంట్లకే కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నేషనల్​ కోటాలో భర్తీ చేస్తారు. ఈ నేషనల్​ కోటాలోనూ మన విద్యార్థులు సీట్లు పొందే అవకాశం ఉంటుంది. ప్రైవేటులోని 2550 సీట్లలో 1275 (50%) సీట్లను కన్వీనర్​‌‌‌‌ కోటాలో భర్తీ చేస్తారు. సీట్లు పెరగడంతో నీట్​లో మెరిట్​ సాధించిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఫీజు ఏడాదికి ₹10 వేలు. ప్రైవేట్​ కాలేజీల్లో కన్వీనర్​ కోటాలో సీటు సాధించిన వారికి ₹60 వేల ఫీజు ఉంటుంది. మిగిలిన వాటిలో సగం బీ కేటగిరీ కింద, మిగతా సగం సీట్లను సీ కేటగిరీ కింద విద్యార్థలుకు కేటాయిస్తారు. వాటినీ నీట్​లో మెరిట్​