75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనవరి 26వ తేదీ శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు గవర్నర్ తమిళిసైకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.