
ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ పరేడ్ గ్రౌండ్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జయశంకర్భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం వారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్కార్యాలయాలు, స్కూల్స్, వివిధ పార్టీలు, యువజన, కుల సంఘాల వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చీఫ్గెస్ట్లు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించి, ఉద్యోగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు.- వెలుగు, నెట్వర్క్