గుజరాత్ లో గోడ కూలి 8 మంది మృతి

గుజరాత్ లో గోడ కూలి 8 మంది మృతి

నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్ ప్రజలు పలు ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఖేడా జిల్లా నాడియాడ్ లో వర్షాల కారణంగా ఓ భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరోచోట ప్రహారీ గోడ కూలి 8 మంది చనిపోయారు.  రాజ్ కోట్ జిల్లా మోర్బీ లోని ఉమియా సర్కిల్, కండ్ల బైపాస్ ప్రాంతంలో ఉన్న ఆ గోడ కూలడంతో గోడ పక్కనే ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.