సంగారెడ్డిలో 84 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

సంగారెడ్డిలో 84  కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

సంగారెడ్డి పటాన్ చెరు ORR టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ & ఎన్ఫోర్స్ మెంట్ మెదక్ డివిజన్ అధికారులు. నిందితుడు నల్లగొండ జిల్లా బొల్లారం పట్టి గ్రామానికి చెందిన రమావత్  రమేష్ చంద్ర  గా గుర్తించిన పోలీసులు.

సుమారు రూ. 12 లక్షల విలువైన 84 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటు బొలెరో కారు ( TS 27 F 7775) వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.