రూ.5 కోట్ల లాటరీ గెలుచుకున్న 88 ఏళ్ల వృద్ధుడు

రూ.5 కోట్ల లాటరీ గెలుచుకున్న 88 ఏళ్ల వృద్ధుడు

పంజాబ్‌లోని డేరాబస్సీలో నివాసముంటున్న మహంత్ ద్వారకా దాస్ అనే 88 ఏళ్ల వృద్ధుడు రూ.5 కోట్ల లాటరీని గెలుచుకున్నారు. పెద్ద మొత్తంలో నగదును గెలుచుకోవడంతో  మహంత్ ద్వారకా దాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను గత 35, -40 సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. గెలిచిన మొత్తాన్ని తన ఇద్దరు కుమారులకు పంచుతానని, మరి కొంత మొత్తాన్ని తన డేరాకు విరాళంగా ఇస్తానని స్పష్టం చేశారు.

నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహంత్ గత 40 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లను కొంటున్నారు. 1947లో 13 సంవత్సరాల వయసులోనే పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఆయన.. తరచూ లాటరీ టికెట్లను కొనుగోలు చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఎట్టకేలకు సంక్రాంతి బంపర్ లాటరీని గెలుచుకొని అందరిచేత ప్రసంసలు పొందుతున్నారు. అయితే మహంత్ గెలుచుకున్న నగదులో పన్ను మినహాయింపులకు పోను సుమారు రూ.3.5 కోట్లు వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.