
- ర్యాష్ డ్రైవింగ్ చేశాడని.. టెన్నెసీ పోలీసుల నిర్వాకం..
- మృతుడి తల్లితో మాట్లాడిన బైడెన్
వాషింగ్టన్: నల్ల జాతీయుడితో అమెరికన్ పోలీసు లు వ్యవహరించిన తీరు ప్రపంచమంతటా చర్చనీయాంశమైంది. ఓవర్ స్పీడ్గా వెళ్లాడని 29 ఏండ్ల నికోల్స్ అనే నల్ల జాతీయుడిని పోలీసులు దారుణంగా చితకబాదారు. ‘‘మామ్.. మామ్” అని అరుస్తున్నా వదల్లేదు. కింద పడుకోబెట్టి చేతులు కట్టేసి.. ముఖంపై దాడి చేశారు. నిలబడలేక కింద పడిపోతున్నా.. ఫేస్పై ఫ్లాష్ లైట్ వేస్తూ.. ఆరుగురు పోలీసులు నికోల్స్ను దారుణంగా కొట్టారు. ఈ ఘటన జనవరి 7న జరిగింది. తీవ్రంగా గాయపడిన నికోల్స్.. 3 రోజుల తర్వాత చనిపోయాడు. పోలీసుల బాడీ కెమెరాల్లో ఇదంతా రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా యూఎస్లో నల్లజాతీయులు ఆందోళనకు దిగారు. ప్రెసిడెంట్ బైడెన్.. నికోలస్ కుటుంబానికి సారీ చెప్పారు. మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాళ్లు.. చేతులు గట్టిగా పట్టుకుని..
టైర్ నికోల్స్ ట్రాన్స్పోర్టు కంపెనీ ఫెడ్ఎక్స్లో జాబ్ చేస్తుంటాడు. జనవరి 7న రాత్రి పని ముగించుకుని కారులో ఇంటికెళ్తున్నాడు. ఓవర్ స్పీడ్, ర్యాష్గా డ్రైవింగ్ చేశాడన్న కారణంతో సౌత్ యూఎస్లోని మెంఫిన్ పెట్రోలింగ్ పోలీసులు నికోల్స్ను అడ్డుకున్నారు. డ్రైవింగ్ సీటు నుంచి బయటికి లాగి నేలపై పడుకోబెట్టి కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా వినిపించుకోలేదు. వారి నుంచి నికోల్స్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్ షాక్ వెపన్ను ప్రయోగించారు.
పోలీసులే చంపేసిన్రు : రోవాన్ వెల్స్, నికోల్స్ తల్లి
నికోల్స్కు నాలుగేండ్ల కొడుకు ఉన్నాడు. తల్లి అంటే ఎంతో ప్రేమ. అతని చేతిపై అమ్మ పేరుతో టాటూ కూడా ఉంది. నికోల్స్ తల్లి శుక్రవారం రోవాన్ వెల్స్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘‘యూఎస్ పోలీసులు నా కొడుకును చంపేశారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడినట్టు పోలీసులు ఇంటికొచ్చి చెప్పారు. కప్స్ వేస్తుంటే పారిపోయేందుకు ట్రై చేయడంతో పెప్పర్ స్ర్పే యూజ్ చేశామన్నారు. అదంతా అబద్ధం. నా కొడుకును దారుణంగా కొట్టిన పోలీసులను కఠినంగా శిక్షించాలి” అంటూ వెల్స్ ఏడుస్తూ చెప్పింది.