దిష్టిబొమ్మల కథేంటి.. థ్రిల్‌‌‌‌ చేసే సరికొత్త మిస్టరీ

దిష్టిబొమ్మల కథేంటి.. థ్రిల్‌‌‌‌ చేసే సరికొత్త మిస్టరీ

శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. మార్చి 1న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలు స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ ‘‘2014లో ‘శీష్‌‌‌‌ మహల్‌‌‌‌’ అనే ఇండిపెండెంట్ సినిమాతో నిర్మాతలుగా మా జర్నీ మొదలైంది. 2020లో ‘నీతో’ అనే సినిమా చేశాం. ఇప్పుడు ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’తో వస్తున్నాం. గతంలో వచ్చిన డిటెక్టివ్ సినిమాలకు భిన్నంగా ఉండే యూనిక్‌‌‌‌ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ఇది. డిటెక్టివ్ పాత్రలో శివ కందుకూరి చాలా సహజంగా నటించారు.

ఆ పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్‌‌‌‌. అలాగే హీరోయిన్‌‌‌‌ రాశి సింగ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. పురుషోత్తం రాజ్ ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని ఓ మంచి కథతో వచ్చారు. ప్రతి ఇంటిముందు దిష్టి బొమ్మ ఉంటుంది. దాని వెనుక వున్న కథకు ఒక ఫాంటసీ ఎలిమెంట్‌‌‌‌ను జోడించి అద్భుతంగా తీశారు. పురాణాలతో ముడిపెట్టి కథ నడిపించిన విధానం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను ఇస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ ఎంగేజింగ్‌‌‌‌గా ఉంటుంది. శ్రీచరణ్ బీజీఎంను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. కంటెంట్‌‌‌‌ను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. సినిమా చాలా గ్రాండ్‌‌‌‌గా వచ్చింది. ఓవర్సీస్, ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయ్యింది. బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.