గండిపేట సీబీఐటీ కాలేజీ వద్ద కారు బీభత్సం

గండిపేట సీబీఐటీ కాలేజీ వద్ద కారు బీభత్సం

రంగారెడ్డి : గండిపేట సీబీఐటీ కాలేజీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి టూవీలర్ ను ఢీకొని ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో టూవీలర్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న సీబీఐటీ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు ఇండియన్ బిజినెస్ స్కూల్‌ లో పని చేస్తున్న ప్రొఫెసర్ నందన్ కుమార్ గా గుర్తించారు.

ప్రొఫెసర్ నందన్ కుమార్.. విధులు ముగించుకుని కళాశాల నుండి టూవీలర్ పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు. విషయం తెలియగానే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.