PVNR ఎక్స్ ప్రెస్ వేపై బోల్తాపడ్డ కారు

 PVNR ఎక్స్ ప్రెస్ వేపై బోల్తాపడ్డ కారు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ PVNR ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రో  పిల్లర్ నెంబర్ 175 దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి.  వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కారు టైర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.

టైర్ పేలగానే కారు డివైడర్ ఎక్కి, అవతలి వైపు ఉన్న కారును ఢీకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు అరాంఘర్ నుంచి మెహదిపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఒకవైపు భారీగా ట్రాఫిక్ జామైంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు..