సాయి పల్లవి వ్యాఖ్యలను ఖండించిన భజరంగ్ దళ్

సాయి పల్లవి వ్యాఖ్యలను ఖండించిన భజరంగ్ దళ్

హైదరాబాద్: టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సాయి పల్లవి వివాదాస్పద కామెంట్స్ చేసింది. సాయి పల్లవి వ్యాఖ్యలు కశ్మీర్ పండిట్స్, హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయంటూ బజరంగ్ దళ్ కు చెందిన కొందరు వ్యక్తులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఓ వీడియో ద్వారా బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు సాయి పల్లవికి కౌంటర్ ఇచ్చారు. దేశం, ధర్మం కోసం పోరాడే గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చడం సరియైనది కాదని విరుచుకుపడ్డారు. అసలు సాయి పల్లవికి కొంచెమైన తెలివుందా అంటూ ప్రశ్నించారు. సర్వ మానవాళికి మేలు చేసే గోమాత మేలు చేస్తుందని, అలాంటి గోవులను అక్రమంగా తరలిస్తున్న గోరక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక విరాట పర్వం మూవీ టైటిల్ పై కూడా తమకు అభ్యంతరాలున్నాయని, హిందువులకు పవిత్రమైన మహా భారతంలోని విరాట పర్వం పేరును నక్సలిజం నేపథ్యంలో తీసిన సినిమాకు ఎలా పెడతారంటూ మండిపడ్డారు. ఈ విషయంలో డైరెక్టర్ వేణు ఊడుగులపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.