రెండో టెస్టులో టీమిండియా విజయం...సిరీస్ కైవసం

రెండో టెస్టులో టీమిండియా విజయం...సిరీస్ కైవసం

ప్రతీ క్షణం ఉత్కంఠం.. ప్రతీ సెషన్ కీలకంగా సాగిన రెండవ టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగవ రోజు మొదటి సెషన్ లోనే ఆట ముగించేసింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్ క్లీన్ స్వీస్ చేసింది. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (29), రవిచంద్రన్ అశ్విన్ (42) కీలక పాత్ర పోషించారు. 

తడబడి.. నిలబడ్డారు

మూడవ రోజు చివరి సెషన్ లో బంగ్లాదేశ్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన భారత్, ఆదిలోనే తడబడింది. 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7), కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2), పుజారా (6), కోహ్లీ (1) ఫెయిలయ్యారు.  మెహెదీ హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ దాటికి మూడవ రోజు చివరి సెషన్ ముగియక ముందే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత నైట్ వాచ్ మెన్లుగా వచ్చిన అక్షర్ పటేల్ (34), ఉనాద్కట్ (13) నాలుగవ రోజు ఆటను మొదలుపెట్టినా, వీళ్ల భాగస్వామ్యం ఎక్కువ సేపు నిలువలేకపోయింది. ఏడొవ వికెట్ లో వచ్చిన పంత్ ఆదుకుంటాడు అనుకుంటే 9 పరుగులకే వెనుదిరిగాడు.

ఆదుకున్న అశ్విన్, అయ్యర్

దాంతో టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యా్ట్స్ మెన్ అశ్విన్, అయ్యర్ టీమిండియాను గెలుపు దిశగా నడిపించారు. భారత బ్యాట్స్ మెన్ ని బోల్తా కొట్టించిన మెహెది హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ ని సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టి భారత్ కు విజయాన్ని అందించారు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యచ్: రవిచంద్రన్ అశ్విన్

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ : చటేశ్వర్ పుజారా

స్కోర్ బోర్డ్:

మొదటి ఇన్నింగ్స్: 

బంగ్లాదేశ్: 227 ఆలౌట్ (మోమినుల్ 84 పరుగులు). ఉమేష్ యాదవ్ 4, ఉనాద్కట్ 2, అశ్విన్ 2 వికెట్లు

భారత్ : 314  ఆలౌట్ (పంత్ 93, శ్రేయస్ 87). షకిబ్ 4, తైజుల్ ఇస్లాం 4, తస్కిన్ 1, మెహెదీ 1 వికెట్లు

రెండవ ఇన్నింగ్స్:

బంగ్లాదేశ్: 231 ఆలౌట్ (జాకిర్ 51, లిట్టన్ దాస్ 73). అక్షర్ 3, సిరాజ్ 2, అశ్విన్ 2, ఉమేష్ 1, ఉనాద్కట్ 1 వికెట్లు

భారత్ : 145-7 అక్షర్ 34, అశ్విన్ 42, శ్రేయస్ 29. మెహదీ 5, షకిబ్ 2 వికెట్లు