తాను మరణిస్తూ.. ఇద్దరికి ప్రాణం పోసిన డెలివరీ బాయ్

తాను మరణిస్తూ.. ఇద్దరికి ప్రాణం పోసిన డెలివరీ బాయ్

గచ్చిబౌలి, వెలుగు:    యాక్సిడెంట్ లో   తీవ్రంగా గాయపడి బ్రెయిన్​డెడ్​ అయిన డెలివరీ బాయ్ మరణిస్తూ మరో ఇద్దరికి ప్రాణం పోశాడు. రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లికి చెందిన బిశ్వాల్ ప్రభాస్(19) స్థానిక డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్​ఇయర్​చదువుతూ.. పార్ట్​టైంగా జొమాటో డెలివరీ బాయ్​గా పని చేస్తున్నాడు. ఈనెల 14న రోడ్డు ప్రమాదానికి గురైన బిశ్వాల్ ప్రభాస్ తీవ్రంగా గాయపడి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో బ్రెయిన్​డెడ్ ​అయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బిశ్వాల్​ఆర్గాన్స్ ​డొనేట్​చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సోమవారం బిశ్వాల్​నుంచి సేకరించిన కాలేయాన్ని డా.సెంథిల్​కుమార్ ​టీమ్ విజయవంతంగా మరో వ్యక్తికి అమర్చారు.