గచ్చిబౌలి, వెలుగు: యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన డెలివరీ బాయ్ మరణిస్తూ మరో ఇద్దరికి ప్రాణం పోశాడు. రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లికి చెందిన బిశ్వాల్ ప్రభాస్(19) స్థానిక డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్ఇయర్చదువుతూ.. పార్ట్టైంగా జొమాటో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఈనెల 14న రోడ్డు ప్రమాదానికి గురైన బిశ్వాల్ ప్రభాస్ తీవ్రంగా గాయపడి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బిశ్వాల్ఆర్గాన్స్ డొనేట్చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సోమవారం బిశ్వాల్నుంచి సేకరించిన కాలేయాన్ని డా.సెంథిల్కుమార్ టీమ్ విజయవంతంగా మరో వ్యక్తికి అమర్చారు.