ఎక్స్‌పైర్ డేట్ సరుకులు కొని.. డేట్ ఛేంజ్ చేసి అమ్ముతున్నాడు

ఎక్స్‌పైర్ డేట్ సరుకులు కొని.. డేట్ ఛేంజ్ చేసి అమ్ముతున్నాడు
  • డిస్ట్రిబ్యూటర్ నిర్వాకాన్నిబయటపెట్టిన పోలీసులు
  • నిందితుడి అరెస్ట్.. లక్షా 50 వేల విలువైన 17 రకాల ఎక్స్‌పైర్ ప్రాడక్టులు, ఆటో ట్రాలీ సీజ్

హైదరాబాద్: కిరాణా కొట్లలో.. లేదంటే సూపర్ మార్కెట్లలో డేట్ ఎక్స్‌పైర్ అయిన సరుకులు తీసుకుని.. ప్యాకెట్లపై డేట్ తుడిచేసి కొత్త డేట్ వేసి తిరిగి దుకాణాలకు అమ్మేస్తున్న ఓ హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ నిర్వాకాన్ని హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు బయటపెట్టారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన లంగర్ హౌజ్ పోలీసులు నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు లక్ష్మీ నారాయణ గత 15 సంవత్సరాలుగా పలు ప్రొడక్టులకు డిస్ట్ర్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే దుకాణాలు, మాల్స్ లో అమ్ముడుపోని ఎక్స్‌పైర్ డేట్ సరుకులు తీసుకొని.. ప్యాకెట్లపై డేట్ ఛేంజ్ చేసి తిరిగి అమ్ముతున్నాడు. అతని వద్ద 17 రకాల ఎక్స్ పైర్ డేట్ సరుకులు దొరికాయి. ప్యాకెట్లపై ఎక్స్ పైర్ డేట్ చేంజ్  చేసి తిరిగి చిన్న చిన్న దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. లంగర్ హౌజ్ కేంద్రంగా ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఇతను 
హల్దీరాం ఎక్సపైర్ ప్రొడక్ట్  డేట్ మార్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు తేలింది. నిందితుడి నుంచి లక్షా 50  వేల విలువ చేసే హల్దీరాం ఎక్సపైరీ ప్రాడక్టులు, ట్రాలీ ఆటో స్వాధీనం చేసుకున్నారు. డేట్ అయి పోయిన వాటిని మార్కర్ తో మార్చి తిరిగి చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. కరోనా ప్రభావంతో వ్యాపారంలో నష్టాలు రావడంతో డబ్బుల కోసం ఇలా డేట్ మారుస్తూ మార్కెట్లో సేల్ చేస్తున్నట్లు నిందితుడు లక్ష్మినారాయణ చెబుతున్నాడు. హల్దీరామ్ కంపెనీ కి కూడా ఈ విషయం తెలియదని.. తానే సొంతంగా చేశానని చెబుతున్నాడు. ఈ మధ్య కాలం నుంచే చేస్తున్నాడా.. లేక మొదట్నుంచి ఇదేపని చేస్తున్నాడా అన్నది తేల్చేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా సరే  ఎక్స్ పైర్ డేట్ అయిన ప్రొడక్టులు అమ్మితే కఠిన చర్యలు  తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ హెచ్చరించారు.