హైదరాబాద్ జీడిమెట్లలో తాగిన మైకంలో యువతి హల్చల్.. అర్థరాత్రి వాహనదారులకు చుక్కలు చూపించింది..

హైదరాబాద్ జీడిమెట్లలో తాగిన మైకంలో యువతి హల్చల్.. అర్థరాత్రి వాహనదారులకు చుక్కలు చూపించింది..

హైదరాబాద్ లో ఓ యువతి తాగిన మైకంలో అర్థరాత్రి హల్చల్ చేసింది. పీకల దాకా తాగిన యువతి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు చుక్కలు చూపించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ యువతి తాగిన మైకంలో అర్థరాత్రి రోడ్డుపై వీరంగం సృష్టించింది. పీకలదాకా తాగిన యువతి వాహనదారులకు చుక్కలు చూపించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అడ్డుకుంటూ.. కేకలు వేస్తూ వీరంగం సృష్టించింది యువతి.

ఇది గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం  అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకున్నారు. వాహనదారులకే కాకుండా పోలీసులకు సైతం కొద్దిసేపు చుక్కలు చూపించింది యువతి. రోడ్డుకు అడ్డంగా నిలబడి కేకలు వేస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షించింది యువతి.

ఎట్టకేలకు 108 సాయంతో యువతిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మద్యం మత్తులో హల్చల్ చేసిన యువతిని రోడామేస్త్రి నగర్ కు చెందిన ఇందుగా గుర్తించారు పోలీసులు.అయితే.. అర్థరాత్రి మాట దేవుడెరుగు.. మహిళలపై పట్టపగలే అత్యాచారాలు జరుగుతోంటే.. తాగిన మైకంలో అర్థరాత్రి నడిరోడ్డుపై హల్చల్ చేసే ఇలాంటి మహిళలు ఉండటం విడ్డూరమని చెప్పాలి.