
గన్నేరువారం, వెలుగు: రెండు నెలలు గడుస్తున్నా సన్న వడ్లకు మద్దతు ధర ప్రకటించలేదని, కనీసం కొనేటోళ్లు లేరంటూ రాష్ట్ర సర్కారు వైఫల్యాన్ని ప్రశ్నించిన ఓ రైతు వీడియో సోషల్మీడియాలో వైరలైంది. కరీంనగర్జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామానికి చెందిన రైతు తిరుపతి సన్న వడ్లు కొనకుండా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కేంద్ర తప్పు చేసిందంటూ బంద్కు మద్దతు పలికిన రాష్ట్ర సర్కారు ఇక్కడి రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు.
ముందు మన ఇల్లు సక్కదిద్దుకున్నంక బయటోళ్ల గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్వ్యవసాయం చేస్తే రైతు కష్టాలు తెలిసేవని అన్నారు. కేంద్రం ఎంఎస్పీ రేటు ప్రకటించలేదని సాకులు చెప్పడం కాదని, క్వింటాలుకు ఇంత ఇస్తామని చెప్పాలని.. లేదా రాష్ట్ర సర్కారు కొనుగోలు చేయదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముందు రాష్ట్రాన్ని సక్కదిద్దుకుని తర్వాత కేంద్రంపై దండెత్తాలన్నారు. సన్నొడ్లకు ముందు రూ. 2,500 ఇవ్వాలన్నారు. అప్పుడే రైతులు కేసీఆర్కు మద్దతు పలుకుతారన్నారు.