
- అధికారులు, సిబ్బందిపై తిట్ల దండకం
- టేబుల్ పై కూర్చుని తాహసీల్దార్ పై బూతులు
- ఆపై ఘర్షణకు దిగితే.. అడ్డుకున్న కానిస్టేబుల్పై కూడా దాడి
లింగంపేట,(కామారెడ్డి జిల్లా) వెలుగు: ‘ఏడాది కాలంగా రెవెన్యూ ఆఫీస్చుట్టూ తిరుగుతున్నా పట్టా భూమిని ఎందుకు పాస్ బుక్లో ఎక్కించడం లేదు. గవర్నమెంట్నుంచి జీతం తీసుకుంటూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తారా..’ అంటూ రైతు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన తోట సంగమేశ్వర్కు చెందిన ఏడుంపావు గుంటల పట్టా భూమి పాసుబుక్లో నమోదు కాలేదు. భూమిని పాసుబుక్లో నమోదు చేయాలని పలుసార్లు తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు.
రెవెన్యూ ఆఫీసర్లు స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చాడు. కలెక్టర్ను వేడుకున్నా పని కాకపోవడంతో బుధవారం సంగమేశ్వర్ఫుల్గా మద్యం తాగి తహసీల్దార్చాంబర్లోకి ప్రవేశించాడు. టేబుల్పై కూర్చుని తహసీల్దార్ మారుతిని బూతులు తిడుతూ ఘర్షణ పడ్డాడు. తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుళ్లు రమేశ్, రాజు అక్కడకు చేరుకున్నారు. కానిస్టేబుల్రమేశ్, వీఆర్ఏలు దత్తు, సురేశ్కలిసి సంగమేశ్వర్ను ఆఫీస్నుంచి బయటకు నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో సంగమేశ్వర్ఆగ్రహంతో కానిస్టేబుల్పై దాడి చేశాడు. తహసీల్దార్ మారుతి ఫిర్యాదు మేరకు సంగమేశ్వర్పై కేసు నమోదుచేసినట్లు ఎస్సై శంకర్చెప్పారు.