- బోథ్లో మూడు గంటల పాటు రాస్తారోకో
బోథ్, వెలుగు: ప్రభుత్వం సోయా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్తో పాటు బోథ్ లో రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్లోని మార్కెట్యార్డుల ముందు ధర్నా చేశారు. వారికి మాజీ జడ్పీ చైర్మన్ సుహాసినీరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘాలు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
బోథ్ మండల కేంద్రంలోని కోరమాండల్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ధర్నా చేశారు. కొనుగోల్లు ప్రారంభించే వరకు ధర్నా ఆపేది లేదని పట్టుబట్టారు. తహసీల్దార్ సుభాష్, ఎస్సై శ్రీసాయిలు అక్కడికి చేరుకొని అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవితో మాట్లాడించి కొనుగోల్లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 3 గంటల పాటు ధర్నా చేయడంతో మార్కెట్ యార్డు ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
