కోల్బెల్ట్, వెలుగు: కాళేశ్వరం జోన్-1 పరిధిలోని పలువురు ఎస్సైలను బదిలీలు చేస్తూ మంగళవారం రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ ఎస్సై జి.రాజశేఖర్ను రామగుండం సీసీఆర్బీకి, గోదావరిఖని టౌన్-1 ఎస్సై ఎల్.భూమేశ్ను రామకృష్ణాపూర్కు, హాజీపూర్ఎస్సై ఎన్.స్వరూప్రాజ్ను రామగుండం పీసీఆర్కు, తాండూర్ ఎస్సై డి.కిరణ్కుమార్ను హాజీపూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
నస్పూర్ సీసీసీ ఎస్సై యు.ఉపేందర్రావును రామగుండం టాస్క్ఫోర్స్కు, రామగుండం కమిషనరేట్ వీఆర్లో ఉన్న ఎన్.సుగుణాకర్ను ఆసిఫాబాద్ వీఆర్కు, ఆసిఫాబాద్ సీసీఎస్ నుంచి ఎస్సై ఎం.ప్రశాంత్ను నస్పూర్ సీసీసీ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు.
బాధ్యతలు తీసుకున్న రామకృష్ణాపూర్ఎస్సై
రామకృష్ణాపూర్ఎస్సైగా ఎల్.భూమేశ్ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని, పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని తెలిపారు. స్టేషన్సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు.
