అనారోగ్యంతో కొడుకు.. బెంగతో తండ్రి మృతి

అనారోగ్యంతో కొడుకు.. బెంగతో తండ్రి మృతి

మెదక్​ , వెలుగు : మెదక్​ జిల్లా మెదక్​ మండలం కూచన్​పల్లిలో ఒకే రోజు తండ్రీకొడుకులు చనిపోయారు. కూచన్​పల్లికి చెందిన పడాల రమేశ్ (48) కు రెండు కిడ్నీలు దెబ్బతినగా 15 ఏండ్ల కింద ఇతడి తండ్రి లచ్చయ్య ఒక కిడ్నీ ఇచ్చాడు.  అప్పటి నుంచి బాగానే ఉన్నాడు. హైదరాబాద్​లో ఓ ట్రావెల్స్​లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రమేశ్​ కిడ్నీ దెబ్బతినగా కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోయాడు. డెడ్​బాడీని కూచన్​పల్లికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు మృతితో మనోవేదనకు గురైన రమేశ్​ తండ్రి  లచ్చయ్య (74)  శనివారం రాత్రి కన్నుమూశాడు. రమేశ్​కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.