జూకల్ సాంఘిక సంక్షేమ స్కూల్ లో11 మందికి అస్వస్థత

 జూకల్ సాంఘిక సంక్షేమ స్కూల్ లో11 మందికి అస్వస్థత
  • 11 మందికి అస్వస్థత గప్​చుప్​గా స్కూల్లోనే చికిత్స 

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణ్ ఖేడ్ జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ స్కూల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్  అయింది. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే స్టూడెంట్లకు పాఠశాలలోనే ఎవరికీ తెలియకుండా చికిత్స అందించారు. గురువారం రాత్రి చేసిన పప్పునే శుక్రవారం కూడా పెట్టడంతో స్టూడెంట్లకు విరేచనాలు,  కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరిగిందని, వారికి మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకొంటామని సంబంధిత అధికారులు చెప్పారు. విద్యార్థులు త్వరగా కోలుకునేలా చికిత్స అందించి, మెనూ ప్రకారం భోజనం పెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.