కార్లు దొంగలించి OLXలో అమ్ముతున్న ముఠా అరెస్ట్

కార్లు దొంగలించి  OLXలో అమ్ముతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు కార్ల చోరీకి పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకుంది. పురాణపూల్ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తుండంగా సీసీఎస్ పోలీసులకు  నెంబర్ ప్లేట్ లేకుండా ఓ i20 కారు కనిపించింది. పోలీసులు నుండి తప్పించుకొవాలని ప్రయత్నించి పరారవుతున్న  డ్రైవర్ లావన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ALSO READ :- ఐదేళ్లుగా ఏపీ దోపిడీకి గురైంది...వైసీపీ గడీలు బద్దలు కొడతాం: పవన్​ కళ్యాణ్​

లావన్ ను విచారించగా అసలు వ్యవహారం బయట పడింది.  ఢిల్లీలో 12 కారులను చోరీ చేసి ఇక్కడ ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. మూడున్నర కోట్ల విలువైన 12 బ్రాండ్ కారులను నిందితుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురిని అరెస్ట్ చేశారు.