భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి..  కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడపలో జరిగింది.  స్థానిక కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు (50) నివాసం ఉంటున్నాడు. అతను కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్‌ నుంచి గన్ తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.   వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.