ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి నాలుగు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 

అగ్నిమాపక సిబ్బంది  మంటలను ఆర్పివేశారు. నిబంధనలకు విరుద్దంగా యాజమాన్యం పరిశ్రమ నడుపుతున్నట్లు గుర్తించారు. కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దాదాపు నాలుగు గంటలు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.