సెల్లార్లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు

సెల్లార్లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ లోని డైరీ ఫామ్ చౌరస్తా వద్ద ఉన్న గ్రీన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని సెల్లార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్ లో పార్కింగ్ చేసి ఉన్న వాహనాలన్నీ పూర్తిగా మంటల్లో తగలబడిపోయాయి. 

విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సెల్లార్ లోని 9 టూవీలర్స్, ఒక కారు మంటల్లో కాలిపోయాయి.

గ్రీన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని వాచ్ మెన్ కుటుంబం రాఖీ పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది.