10 అడుగుల కొండ చిలువ..పరుగులు తీసిన జనం

10 అడుగుల కొండ చిలువ..పరుగులు తీసిన జనం

తిరుమలలో భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. టీటీడీ వేస్ట్ వాటర్ క్లీన్ ప్లాంట్ దగ్గర సుమారు 10 అడుగుల ఎత్తు ఉన్న భారీ కొండచిలువ కనిపించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కూలీలు పరుగులు తీశారు. వెంటనే తిరుమల స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భాస్కర్ నాయుడు.... ఘటనా స్థలానికి చేరుకొని కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నాడు. తాను తెచ్చుకున్న సంచిలో దాన్ని బంధించి....తిరుమల అడవిలో  వదిలిపెట్టాడు.