హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆవరణలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ బ్యూరో చీఫ్ ఆఫీసర్టి.రాములు తెలిపారు. జాబ్ మేళాలో మెడ్ప్లస్ గ్రూప్ కంపెనీ పాల్గొంటుందని.. ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్లోని రెండు విభాగాల్లో దాదాపు 200 పోస్టులు భర్తీ చేసేందుకు డిప్లొమా ఇన్ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ ఉండి 18 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.
బయోడేటా, విద్యార్హతల జిరాక్స్ సర్టిఫికెట్లతో 22న ఉదయం 11 గంటలకు హాజరవ్వాలన్నారు. మరిన్ని వివరాలకు 96666 62481 నంబర్లో సంప్రదించగలని సూచించారు
