సుదర్శన్ ​రెడ్డికి ఒక న్యాయం నాకో న్యాయమా? : సౌదాగర్​ గంగారాం

సుదర్శన్ ​రెడ్డికి ఒక న్యాయం నాకో న్యాయమా? :  సౌదాగర్​ గంగారాం

పిట్లం,వెలుగు: 46 ఏండ్లుగా ప్రజా సేవలో ఉన్న తనను కాదని నాన్​లోకల్​ వారికి ఎలా టికెట్​ఇచ్చారంటూ జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్​ గంగారాం కాంగ్రెస్ ​అధిష్టానంపై ఫైర్​అయ్యారు. ఆదివారం పెద్దకొడప్​గల్​లో తన నివాసం లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో మాట్లాడారు.

బోధన్​ కాంగ్రెస్​అభ్యర్థి సుదర్శన్​ రెడ్డికి ఒక న్యాయం, తనకో న్యాయమా అని ప్రశ్నించారు. 1991లో సుదర్శన్​రెడ్డి కాంగ్రెస్​అభ్యర్థి బాలాగౌడ్​కోసం కాకుండా టీడీపీ అభ్యర్థి కేశ్​పల్లి గంగారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశారని, 2019 ఎంపీ ఎన్నిక్లలోనూ ధర్మపురి అర్వింద్​కు మద్దతిచ్చి మధుయాష్కి ఓటమికి కారణమయ్యాడన్నారు.

పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఆయనకు టికెట్​ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జుక్కల్​లో తనకు కేడర్​ లేదంటున్న వారికి ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. తన అభిమానులు, అనుచరులు కారుగుర్తుకు ఓటెయాలని సూచించారు. తనను పార్టీ సస్పెండ్​ చేసినా భయపడేది లేదన్నారు. 

కామారెడ్డి: జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారాంను  కాంగ్రెస్​ పార్టీ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ క్రమ శిక్షణ సంఘం చైర్మన్​ చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.