బోనులో చిక్కిన చిరుత

బోనులో చిక్కిన చిరుత

మెదక్: కొంతకాలంగా స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామరం తండాలో ఓ చిరుత గత కొంతకాలం నుంచి సంచరిస్తుంది. రాత్రి వేళ కట్టేసిన పశువులపై దాడులు చేస్తూ.. స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. దాంతో ఆందోళన పడ్డ గ్రామస్తులు.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత పట్టుకోవాలని అధికారులు.. గ్రామంలో అక్కడక్కడ బోనులు ఏర్పాటుచేశారు. ఆ చిరుత శనివారం రాత్రి ఓ బోనులో పడింది. గమనించిన స్థానికులు.. వెంటనే అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. గ్రామానికి చేరుకున్న సిబ్బంది.. చిరుతను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఘటనా స్థలానికి చేరుకొని తరలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.