పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా మంచి రేవుల గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందిన సంపత్, పార్వతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం రాత్రి ఇధ్దరు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగారు. తర్వాత ఫోన్ చేసి విషయాన్ని స్నేహితులకు చెప్పి  కాపాడాలని చెప్పారు. పోలీసుల సాయంతో హాస్పిటల్ కు తరలించారు  స్నేహితులు. అయితే పరిస్థితి విషమించడంతో సంపత్, పార్వతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి చనిపోయారు. ఈ ఘటనపై నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

రూపాయికే క్వార్టర్ మందు