హైకోర్టులోనే గొంతు కోసుకుని.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం 

హైకోర్టులోనే గొంతు కోసుకుని.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం 

కర్ణాటక హైకోర్టులో చీఫ్ జస్టిస్ నీలయ్ విపిన్ చంద్ర అంజారియా, న్యాయవాదులు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. హైకోర్టు హాల్ ఒకటిలో మైసూర్‌కు చెందిన శ్రీనివాస్ కత్తితో గొంతు కోసుకున్నాడు. శ్రీనివాస్ కోర్టులోని ఫస్ట్ హాలుకు వచ్చి అక్కడ ఉన్న సెక్కూరిటీకి ఫైల్ ఇచ్చాడు. తర్వాత తనతోపాటు తెచ్చుకున్న కత్తి బయటకు తీసి గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రతయత్నించాడు. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి అక్కడున్న వారంతా షాకయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకొని, సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.

శ్రీనివాస్ ఎవరు, ఎందుకు కోర్టులోపలికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని వివారలు తెలియదు. హైకోర్టులో భద్రతా లోపంపై చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కత్తితో లోపలికి ఎలా రానిచ్చారు. ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు. సెక్యూరిటీ సిబ్బందికి శ్రీనివాస్ ఇచ్చిన ఫైల్ కు సంబంధించి కోర్టు న్యాయవాదిని నియమించలేదు. అందుకోసమే ఆ ఫైల్‌ను పరిశీలించడం లేదని హైకోర్టు రిజిస్ట్రార్ వివరించారు. కోర్టు ఆదేశాలు లేకుండా అధికారులు ఎలాంటి పత్రాలు స్వీకరించొద్దని స్పష్టం చేశారు. శ్రీనివాస్ సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశాడనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. గాయపడ్డ శ్రీనివాస్ కోలుకున్న తర్వాత స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు ఎదురు చూస్తున్నారు.