కూలర్ కు కరెంట్ సప్లై.. షాక్ కొట్టి వ్యక్తి మృతి

కూలర్ కు కరెంట్ సప్లై.. షాక్ కొట్టి వ్యక్తి మృతి

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఇంట్లో కూలర్​కు కరెంట్ సప్లై అయి షాక్ కొట్టి  వ్యక్తి మృతిచెందిన ఘటన  మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేటలో జరిగింది.  పోలీసుల   తెలిపిన  ప్రకారం.. పెద్దపేటకు చెందిన వశాక పోసుమేర(49) గురువారం పొలానికి వెళ్లి వర్షానికి తడిసి ఇంటికి వచ్చాడు.  కూలర్ ఆన్​ చేసి ఉండగా.. దాన్ని తాకడంతో  షాక్ కొట్టి కిందపడ్డాడు.  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. మృతుడికి భార్య నానుబాయి, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.