- సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
సంగారెడ్డి, వెలుగు: పోలీసులు తన ఫోన్ లాక్కుని తిరిగి ఇవ్వలేదని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డిలోని రాజంపేటకు చెందిన సంతోశ్కుమార్ గురువారం బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్తనిఖీ చేయడాన్ని చూశాడు. వెంటనే ఫోన్ లో తనిఖీల ఫొటోలు, వీడియో తీశాడు. గమనించిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ ఫోన్లాక్కున్నారు.
ఎంతసేపు బతిమలాడినా ఫోన్ఇవ్వకపోవడంతో సంతోశ్ వెంటనే పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి వెళ్లాడు. బాటిల్లో పెట్రోల్ పోయించుకుని హైవేపైకి వచ్చాడు. పోలీసుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు సంతోష్ కుమార్ పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం సంతోశ్50 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు.