నంద్యాల జిల్లా శ్రీశైలంలో తుపాకీ కలకలం సృష్టించింది. శ్రీశైలం టోల్ గేట్ దగ్గర టెంపుల్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తుపాకీతో పట్టుబడ్డాడు. దొరికిన తుపాకీని శ్రీశైలం సీఐ ప్రసాదరావుకు అందజేశారు టెంపుల్ సెక్యూరిటీ.
ఆ వ్యక్తిని విచారించగా తాను మధ్యప్రదేశ్ క్రైం బ్రాంచ్ సీఐ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఓ కేసు విషయంలో శ్రీశైలం వచ్చినట్లు పోలీసులతో చెప్పారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థమై శ్రీశైలం వచ్చామని చెప్పారు. అతడి నుంచి ఐడీ కార్డు, తుపాకీ తీసుకున్న శ్రీశైలం సీఐ ప్రసాదరావు విచారిస్తున్నామని తెలిపారు.
